విష్ణోవాచః 'దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై వుండగా, విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు యెంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనమును చేయాలి. కాని, బ్రాహ్మణుని మాత్రం దండించగూడదు.
శ్లో|| బ్రాహ్మణో బ్రాహ్మణై రేవ నిగ్రాహ్యో వేదవాదిభిః
సత్య ధర్మాది నిరతైః లోభ దంభ వివర్జితైః ||
దోషియైన బ్రాహ్మణుని - వేదవిదులు, సత్యధర్మనిరతులు, లోభదంభ శూన్యులూ అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమునుచేసి, ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు - ధనహరణము లేదా వస్త్రహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప, రాజు శిక్షించగూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, యితరులచే తాను చంపించినా, కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు - బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై వున్నాడు. కాబట్టి నువ్వు తత్ క్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు. తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది' అని విష్ణువు చెప్పగానే, దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసునిని, అతనిమీదికి రానున్న సుదర్శనాన్నీ చూడగానే, అంబరీషుడు - ఆ చక్రానికికేదురేళ్ళి - 'ఓ సుదర్శన చక్రమా! నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందునా బ్రాహ్మణుని ఇలా క్రూరంగాహింసించడం న్యాయం గాదు' అంటూనే ధనుర్ధారియై, ఇంకా ఇలా చెప్పసాగాడు.
ఏవం శ్రీస్కాందపురాణంతర్గత కార్తీక మహాత్మ్యే
సప్తవింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది ఏడు అధ్యాయము)
ఏవం శ్రీస్కాందపురాణంతర్గత కార్తీక మహాత్మ్యే
సప్తవింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది ఏడు అధ్యాయము)
No comments:
Post a Comment