పురంజయోపాఖ్యానము
త్రేతాయుగంలో, సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడూ అయిన ఆ రాజు __ అత్యధికమైన ఐశ్వర్యము కలగడంలో అహంకరించినవాడై __ బ్రాహ్మణ , ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ వీహీనుడూ, దుష్టపరాక్రమయుక్తుడూ, దుర్మార్గవర్తనుడూ అయి ప్రవర్తింపసాగాడు.. తద్వారా అతని ధర్మబలము నశించడంతో, సామంతులైన కాంభోజ కురుజాదులనేక మంది యేకమై __ చతురంగ బలలాతో వచ్చి _ అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బాలమదయుక్తుడై __ శత్రువులతో తలపడెందుకు సిద్దమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నదీ, ప్రకాశించేదీ, జెండాతో అలంకరించబడినదీ, ధనుర్భాణాదిక శాస్రాస్త్రాలతో సంపన్నమైనదీ, అనేక యుద్దాలతో విజయం సాధించినది. చక్కటిగుర్రాలు పూన్చినదీ, తమ సూర్యవంశాన్వయమైనదీ అయిన రధాన్నదిరోహించి __ రధగజతురగపదాతులు __ అనబడే నాలుగు రకాల బలముతో __ నగరము నుండి వెలువడి __ చుట్టుముట్టిన శత్రుసైన్యములపై విరుచుకుపడ్డాడు.
ఏవం శ్రీస్కాంద పురాణా౦తర్గత కార్తీక మహాత్మ్యే
వింశాధ్యాయము సంపూర్ణం
No comments:
Post a Comment